Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు నిత్యావసర వస్తువుల ధరలను పెంచటాన్ని నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మండల రెవెన్యూ కార్యాలయం ముందు రేపు జరిగే ధర్నాను విజయవంతం చేయాలని సీపీఐ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఎస్కే. యాకూబ్, సీపీఐఎంల్ న్యూ డెమోక్రసీ నాయకులు కామళ్ళ నవీన్ కోరారు. మండల కేంద్రంలో గురువారం వామపక్ష పార్టీల సమావేశంలో వారు మాట్లాడారు. బీజేపీ, టీఆర్ఎస్ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ, దేశ సంపద మొత్తం వారికే ధార దాత్తం చేస్తూ దేశాన్ని అప్పుల పాలు చేస్తున్నాయని అన్నారు. ఇందుకు నిరసనగా సామాన్య ప్రజల పక్షన ధర్నా చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ త్రిపురం సుధాకర్ రెడ్డి, జిల్లా ప్రజానాట్యమండలి కార్యదర్శి బాదే నర్సయ్య, సీపీఐ మండల కార్యవర్గ సభ్యులు యడ్ల అంజిరెడ్డి, సీపీఐ(ఎం) నాయకులు తుమ్మల సైదయ్య, కామళ్ళ శ్రీనివాస్ పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న వామపక్ష నాయకులు.