Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
పట్టణ కేంద్రంలో రోడ్డు వెడల్పు కార్యక్రమంలో ఇండ్లు కోల్పోయిన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు పారేపల్లి శేఖర్రావు డిమాండ్ చేశారు.ఆదివారం పట్టణంలోని అరిబండి భవన్లో నిర్వహించిన పార్టీ పట్టణకమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.పట్టణంలో ఆర్అండ్బీ రోడ్డు వెడల్పు కార్యక్రమంలో ముందస్తు సమాచారం ఇవ్వకుండా తెల్లవారుజామున ఇండ్లు షాపులు కూల్చి రోడ్డున పడేయడం జరిగిందన్నారు.నిర్వాసితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యవసర వస్తువుల ధరలు విపరీతముగా పెంచడం ద్వారా సామాన్యులపై భారం పడుతుందని వెంటనే నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో టౌన్ కార్యదర్శి కొదమగుండ్ల నగేష్, కుంకు తిరుపతయ్య, అనిగంటి మీనయ్య, వాసా సంపత్, కొండపల్లి వరలక్ష్మీ, ఎస్కే.అఫీస్, నీలా రామ్మూర్తి, ఎడ్ల సైదులు,సంపత్, శ్రీను పాల్గొన్నారు.