Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
నవ తెలంగాణ- భువనగిరి రూరల్
యాదాద్రి భువనగిరిని స్మోకింగ్ ఫ్రీ జిల్లాగా మార్చాలని, అధికారులు అందరూ కషి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. సోమవారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్బంగా జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. బహిరంగ ప్రదేశాలలో దూమపానం నేరం అని తాగినచో 200 జరిమానా లేదా జైలు శిక్ష ఉంటుందని ,విద్య సంస్థలకు 100 గజాల వరకు ఎలాంటి పొగాకు విక్రయాలు జరగరాదని , 18 సవంత్సరాల లోపు పిల్లలు అమ్మిన కొనుగోలు చేసిన నేరం అని పొగాకు తాగటం వలన క్యాన్సర్, గుండెజబ్బు, ఊపిరి తిత్తుల వ్యాధులు, టి.వి డయాబెటిస్ రక్తపోటు మొదలుగునవి వస్తాయని అన్నారు. ప్రజలు వీటికి దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపుడుకోవాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా,, కె. మల్లికార్జున్ ఆధ్వర్యంలో భువనగిరి బస్టాండ్ పరిసర ప్రాంతాలలో పొగ తాగుతున్న వారిని గుర్తించి 200 రూపాయాలు జరిమాన విధించినట్లు తెలిపారు. పొగ తాగడం వలన కలిగే దుష్పరిమాణాలను వారికి తెలిపి పొగ తాగటం మాని వేయాలని తెలిపారు. ఇప్పటినుండి జిల్లా వ్యాప్తంగా బహిరంగ ప్రాంతాలో పొగ తాగేవారిని గుర్తించి జరిమానా విధిస్తామని ఈ దాడులు జిల్లా వ్యాప్తంగా పోలీస్ వారి సహకారంతో జరుగుతాయని తెలిపారు. 3న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పట్టణంలోని జూనియర్ కళాశాల నుండి ఉదయం 11 గంటలకు ర్యాలీని ప్రారంభిస్తారు. ఈ సమావేశంలో ఏసీపీ వెంకట్ రెడ్డి , జిల్లా వ్యవసాయ అధికారిణి అనురాధ, డి.పి. ఓ సునంద , కమిటీ సభ్యులు, స్కిడ్ సొసైటీ ఫర్ కమ్యూనిటీ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ డైరెక్టర్ నాగరాజు , ప్రాజెక్ట్ మేనేజర్ భాను కుమార్ పాల్గొన్నారు.