Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భువనగిరిరూరల్
ఈ నెల 21న యునివర్శిటీలో పీహెచ్డీ ఫైనల్ సెమినార్ లో స్వామి వివేకానంద ఫార్మసీ కళశాల - వంగపల్లి , యాదగిరిగుట్ట , జిల్లా యదాద్రి భువనగిరిలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎలిమినేటి మధుసూదనరెడ్డికి ప్రఖ్యాత విశ్వవిద్యాలయం ఎస్ జేజేటీయూ - రాజస్థాన్ నుండి ఫార్మసీ విభాగంలో డాక్టరేట్ అవార్డు లభించింది . అతను సమర్పించిన పరిశోధన వ్యాసం ''ఇవాల్యుయేషన్ ఆఫ్ న్యూరో ప్రొటెక్టీవ్ అండ్ అన్టీ అల్జీమర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ సమ్ ఇండియన్ మెడిసినల్ ప్లాంట్స్ '' యునివర్శిటీ ద్వారా ఆమోదం పొందినది. ఈ పరిశోధన 2017 లో యునివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్ రాకేష్ కుమార్ జాట్, ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ హరికిరణ్ పర్యవేక్షణలో మొదలై 2022లో సమర్పించారు . డాక్టరేట్ అవార్డు అందుకున్న సందర్బంగా కుటుంబ సభ్యులు , మిత్రులు, కళాశాల బందం ఎలిమినేటి మదుసూదన్ రెడ్డికి అభినందనలు తెలిపారు.