Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
పట్టణంలో అండర్గ్రౌండ్ డ్రయినేజీలో జరిగిన అవినీతిపై న్యాయ విచారణ జరపాలని తెలంగాణ జనసమితి రాష్త్ర ప్రధాకార్యదర్శి సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జి ధర్మార్జున్ డిమాండ్ చేశారు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి జగదీశ్రెడ్డి ఆ నిర్మాణసంస్థతో కుమ్మక్కై పనులుచేయకుండా బిల్లులు ఎత్తుకుని కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.అండర్ గ్రౌండ్ డ్రయినేజీ నిర్మాణంలో జరిగిన అవినీతిపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తెలంగాణ జనసమితి నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.అడ్మినిస్ట్రేషన్ అధికారికి వినతిపత్రం అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో భాగంగా సాధించుకున్న సూర్యాపేట జిల్లాకేంద్రం భౌగోలి కంగా విస్తరిస్తూ ఉందన్నారు.ప్రజా అవసరాలకు అను కూలంగా ప్రజల డిమాండ్ మేరకు ప్రభుత్వం సూర్యాపేట మున్సిపల్ పరిధిలో అండర్గ్రౌండ్ డ్రయినేజీ నిర్మాణానికి నిధులు కేటాయి ంచార న్నారు.నిర్మాణపనుల టెండర్ దక్కించుకున్న సంస్థ కానీ, మున్సిపల్ అధికారులు కానీ డీపీఆర్ను ప్రజలముందు వుంచకుండా తమ ఇష్టానుసారంగా నాసిరకంగా నిర్మాణపనులు చేపట్టి ఏండ్లతరబడిగా నిర్మాణం పూర్తి చేయకుండా కాలయాపన చేస్తూ అవినీతికి పాల్పడుతూ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు గట్ల రమాశంకర్, జిల్లా అధ్యక్షుడు మాండ్రా మల్లయ్యయాదవ్, పట్టణ అధ్యక్షులు బందన్ నాయక్,ఉపాధ్యక్షుడు బీసు స్వామిగౌడ్, ఎస్టీ సెల్ పట్టణ కన్వీనర్, దేవత్ సతీష్, యువజన సమితి నాయకులు హరీష్, డుంగ్రోత్ శ్యామ్, అశోక్, సిద్ధు పాల్గొన్నారు.