Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ
నవతెలంగాణ-సూర్యాపేట
మహిళలందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమసమాజం సాధ్యమవుతుందని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ అన్నారు.మంగళవారం స్థానిక కార్యాలయంలో మెప్మారిసోర్స్ పర్సన్లు, అధికారులకు నిర్వహించిన ఒక్కరోజు శిక్షణా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో పట్టణాన్ని అభివద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.కాగా సంక్షేమ కార్యక్రమాలు మహిళల ఆరోగ్యంపై ప్రత్యేకకార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఐక్యరాజ్య సమితిలో ప్రధాన విభాగమైన యూనిసెఫ్ వారి సహకారంతో పట్టణ పేదరికనిర్మూలన సంస్థ-మెప్మా ఆధ్వర్యంలో రాష్ట్రంలో మూడు పట్టణాలలో టెలి స్వాభిమానం అనే పైలెట్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామన్నారు.ఈ మూడు పట్టణాల్లో సూర్యాపేటను ఎంపిక చేయడం హర్షణీయమన్నారు.ఆరోగ్యవంతమైన పట్టణంగా మార్చడానికి పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ట్రీ పార్కులను ఏర్పాటు చేశామన్నారు.తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం, మినీట్యాంక్ బండ్ సుందరీకరణ, విశాలమైన రోడ్లనిర్మాణం, రోడ్ జంక్షన్ల అభివద్ధి మొదలగు కార్యక్రమాలు చేపట్టామని విమర్శించారు.మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ పట్టణంలో మెప్మా, షీ టీమ్, భరోసా సెంటర్, పోలీసు శాఖ, శిశు సంక్షేమ శాఖ, ఆరోగ్య శాఖ సమన్వయంతో టేలి మహిళా మిత్ర కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.తల్లి పిల్లల సంరక్షణ ప్రధాన పాత్ర గా మెప్మా రిసోర్స్ పర్సన్లు పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో యూనిసెఫ్ ప్రతినిధి గౌరీ, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ రమేష్నాయక్, షీ టీం ఇన్చార్జి ఏఎస్ఐ పాండునాయక్, షీటీం అధికారి జ్యోతి, భరోసా సెంటర్ ఇన్చార్జి రజిత, సఖి సెంటర్ ఇంచార్జి శైలజ, శిశు సంక్షేమశాఖ అధికారి రూప, పట్టణసమాఖ్య అధ్యక్షురాలు కవిత, మెప్మా సిబ్బంది రేణుక, శ్వేత, రోజా, సువర్ణ, ఉమా, పాపమ్మ, లక్ష్మణ్, ఆర్పీలు, సమాఖ్య అధ్యక్షురాళ్ళు పాల్గొన్నారు.