Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-సూర్యాపేటటౌన్
ఆర్థికంగా వెనుకబడిన పేదలను ఆదుకోవడమే సదాచార్ ట్రస్ట్ లక్ష్యమని ట్రస్ట్ కన్వీనర్ ఈగా దయాకర్ గుప్త అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో గల సదాచార్ ట్రస్ట్ సేవా మందిరంలో ఆర్ధికంగా వెనుకబడిన చివ్వేంల మండలం కుడకుడ గ్రామానికి చెందిన వధువు మేడి అనూష వివాహం నిమిత్తం దాతలు మిర్యాల శివకుమార్, కవితల ఆర్ధిక సహకారంతో మంగళసూత్రం,మట్టెలు అందచేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సదాచార్ ట్రస్ట్ సభ్యులు, దాతలు మిర్యాల శివకుమార్, కవిత, శ్రీరంగం రాము,ఈగా విజయలక్ష్మి , పద్మ ,బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.