Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి యాదాద్రి భువనగిరి జిల్లాలో శనివారం జిల్లా కలెక్టర్ , మేజిస్ట్రేట్ పమేలా సత్పతి హైరిస్క్ గ్రూపు కోసం ఏర్పాటు చేసిన ఏన్ సి డి గైనిక్ స్క్రీనింగ్ క్యాంప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దురలవాట్లకు దూరంగా ఉండడం వలన వాటి ద్వారా వచ్చే వ్యాధులను నివారించవచ్చ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. కె. మల్లికార్జున రావు మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, డి సీహెచ్ఏస్ డా. చిన్న నాయక్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.ప్రశాంత్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. వినోద్, చౌటుప్పల్ డిప్యూటీ డీహెచ్ఎంఓ డా. యశోదా, ప్రోగ్రామ్ ఆఫీసర్ ఏన్పీడీ డా.సుమన్ కళ్యాణ్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా నెలవారీ సమీక్షా సమావేశం
జిల్లా వైద్య , ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.కె. మల్లికార్జున రావు ఆధ్వర్యంలో నెలవారి సమీక్ష సమావేశం పీహెచ్సీ సూపర్వైజర్లకు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని ఆరోగ్య సూచికలలో ముందు ఉండాలని సరైన సమయంలో గర్భిణీలను నమోదు చేసి అందరూ ప్రభుత్వ ఆసుపత్రిలోనే పరీక్షలు చేయించుకొని కాన్పులు కూడా ప్రభుత్వ ఆసుపత్రులలో జరిపించాలని సూచించారు. ఈ నెలను మలేరియా మాసోత్సవంగా జరుపుకుంటున్నామని, ఎన్సీడీ, టీబీ , కుష్టు వ్యాధిల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. జిల్లాను వైద్య రంగంలో ముందుంచే బాధ్యత ఎరిగి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎంసీపీ ఫోల్డర్లను పంపిణీ చేసారు.