Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలి
- కలెక్టర్ టి.వినరుకష్ణారెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాలో ఈ నెల 12 న నిర్వహించే టెట్ పరీక్షను పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ టి.వినరు కృష్ణారెడ్డి ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖ, అనుబంధ శాఖల అధికారులతో టెట్ నిర్వహణపై నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ యస్.మోహన్రావుతో కలిసి మాట్లాడారు.పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని, నియమించిన అధికారులు అన్ని కేంద్రాలలో మౌలికవసతులుకల్పించాలని సూచించారు. ఈనెల 12 న 09:30 నుండి మధ్యాహ్నం12:00 ల వరకుపేపర్-1 అలాగే మధ్యాహ్నం 02:30 నుండి సాయంత్రం గం. 05.00 ల వరకు పేపర్-2లు నిర్వహించబడునన్నారు.పరీక్ష నిర్వహణ కోసం రూట్ఆఫీసర్,ఫ్లయింగ్ స్క్వాడ్ బందాలకు, చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు పరీక్ష నిర్వహణపై శిక్షణ ఇచ్చామన్నారు.అందరూ సిబ్బంది ఒక్కరోజు ముందుగా తమ పరీక్షాకేంద్రంనందు అన్నీ మౌలిక వసతులను ఏర్పాటు చేసుకోవాలన్నారు.ముఖ్యంగా తాగునీరు, నిరంతర విద్యుత్, మెడికల్ కిట్స్ అన్ని కేంద్రాల్లో ఏర్పాటుతో పాటు పరీక్షాకేంద్రాల్లో సీసీకెమరాలు అమర్చాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రాజేంద్రకుమార్, జిల్లా విద్యాశాఖాదికారి అశోక్,అసిస్టెంట్ కమిషనర్ (పరీక్షలు)తహసీల్దార్లు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.