Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ
నవతెలంగాణ -ఆలేరురూరల్
పెంచిన మొక్కలను సంరక్షించాలని జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ అన్నారు. గురువారం మండలంలోని గొలనుకొండ గ్రామంలో నర్సరీని, రైతు వేదికను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తొందర్లోనే మొక్కలు నాటాలని సూచించారు. రైతు వేదిక రైతులకు అవగాహన కల్పిస్తున్న రాలేదా అని రికార్డులను పరిశీలించి రైతులను అడిగి తెలుసుకున్నారు .ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, ఏఈవో శాలిని ,కారోబార్ రామచంద్రయ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.