Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడిషనల్ కలెక్టర్ పాటిల్ హేమంత్కేశవ్
నవతెలంగాణ-సూర్యాపేట
పట్టణంలో ప్రజల సౌకర్యార్థం నిర్మించిన పబ్లిక్ మరుగుదొడ్లను ప్రతినిత్యం పరిశుభ్రంగా ఉంచేందుకు మరుగుదొడ్లను శుభ్రం చేసే అధునాతన యంత్రాలను పరిశీలిస్తున్నట్లు జిల్లా అడిషనల్ కలెక్ట్ పాటిల్ హేమంత్ కేశవ్,మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.గురువారం స్థానిక కొత్తబస్టాండ్ వద్ద గల పబ్లిక్ మరుగుదొడ్డిని శుభ్రం చేసే అధునాతన యంత్రంపని తీరును పరిశీలించి మాట్లాడారు.పట్టణ ప్రజలు పాదచారుల సౌకర్యార్థం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పబ్లిక్ టాయిలెట్స్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.వీటిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతున్నప్పటికీ మరింత పరిశుభ్రంగా ఉంచేందుకు యంత్రాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.ఈ యంత్రాల పనితీరు బాగా ఉంటే పట్టణంలోని 22 టాయిలెట్ల లో అమలు చేస్తామన్నారు. యంత్రం పనితీరును తెలుసుకునేందుకు డెమో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.సూర్యాపేట పట్టణానికి బహిరంగ మల మూత్ర విసర్జన రహిత పట్టణంగా పేరు ఉందని దాన్ని కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణరెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, 4వవార్డ్ కౌన్సిలర్ లక్ష్మి, కోఆప్షన్ సభ్యులు స్వరూపరాణి, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాసు, జనార్దన్రెడ్డి, కంపెనీ ప్రతినిధులు ఫిరోజ్, రాకేశ్, నలబోలుసైదిరెడ్డి, రత్నావత్ రాంబాబు, పెండ్రా రాము, వట్టే లింగరాజు, అక్కెనపెల్లి మహేష్, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.