Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మానవ అక్రమరవాణా నిరోధంపై ప్రజలు భాగస్వామ్యం కావాలి
- ఎస్పీ రాజేంద్రప్రసాద్
నవతెలంగాణ-సూర్యాపేట
మానవ అక్రమ రవాణా అనేది సమజా భద్రతకు, మనిషి మనుగడకు అత్యంత ప్రమాదకరమని ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు.యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ -ఎ. హెచ్.టి అధ్వర్యంలో గురువారం జిల్లాకేంద్రంలో మానవ అక్రమరవాణా ప్రజా అవగాహనా ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు.మానవ అక్రమ రవాణాపై ప్రజలందరూ అవగాహన పెంపొందించు కోవాలని, గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై అన్ని విభాగాలు నిఘాఏర్పాటు చేసి సమాజహితం కోసం పాటుపడాలన్నారు.ఇలాంటివి ఏదైనా సంభవించకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.అక్రమ రవాణాపై పోలీసు వారికి సమాచారం అందించడంతో పాటు సహకరిం చాలన్నారు.ఇందులో భాగంగా డయల్ 100కు, 112 టోల్ఫ్రీనెంబర్కు, 8331940134కు సమాచారం అందించాలని పేర్కొన్నారు.జిల్లాకేంద్రంలోని కొత్తబస్టాండ్ నుండి శంకర్ విలాస్సెంటర్, కోర్టు చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగభూషణం, పట్టణ సీఐ ఆంజనేయులు, సీసీఎస్ ఇణ్స్పెక్టర్ రవికుమార్, స్పెషల్ బ్రాంచి సీఐ ప్రవీణ్కుమార్, జిల్లా యాంటీహ్యుమన్ ట్రాఫికింగ్ ఎస్సై నరేష్, టౌన్ ఎస్సైలు క్రాంతి, యాకూబ్, ట్రాఫిక్ ఎస్సై నరేష్,టీమ్ సిబ్బంది, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు.