Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
నకిరేకల్ పట్టణంలోని అక్రమంగా ప్రభుత్వ కార్యాలయాలను కూల్చి వేయించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కందాల ప్రమీల, టీపీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రవీందర్ మాట్లాడుతూ నకరేకల్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ప్రజాధనంతో నిర్మించిన గ్రంథాలయం, కరెంట్, పంచాయతీ రాజ్ కార్యాలయం, పశువైద్యశాల భవనం, మండల పరిషత్ అతిథి గహాలను ఈ నెల 4న అర్ధరాత్రి పూర్తి వేశారన్నారు. ప్రజలకు అందుబాటులో ఉన్న కార్యాలయాలను కూల్చి సమీకత మార్కెట్ నిర్మించాలని ప్రయత్నించడం శోచనీయమన్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ప్రభుత్వ భవనాలు కూల్చి వేయించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి యాతకుల అంజయ్య, గీతకార్మిక సంఘం డివిజన్ కార్యదర్శి రాచకొండ వెంకన్న గౌడ్, సీపీిఎం పట్టణాధ్యక్షుడు వంటేపాక వెంకటేశ్వర్లు, నాయకులు ఎండీ యూసుఫ్, పందిరి సతీష్ పాల్గొన్నారు.