Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత బంధు పథకం దేశానికే ఆదర్శం
- ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
నవతెలంగాణ -భూదాన్పోచంపల్లి
గ్రామాలభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని, దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలో కప్రరాయిపల్లి , రామలింగం పల్లి గ్రామంలో ఆయన పర్యటించారు. పర్యటిస్తూ హెచ్ఎండీఏ, ఎస్డీఎఫ్ నిధులతో పలు అభివద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం గ్రామాలలో 5విడత పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. రామలింగంపల్లి గ్రామంలో దళిత బంధు పథకం కింద గ్రామంలో మంజూరైన ఆస్తులను లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే గ్రామాలలో మౌలిక వసతులు మెరుగు పడ్డాయన్నారు. గతంలో పరిపాలించిన ప్రభుత్వాలు గ్రామాలకు ఇన్ని లక్షల రూపాయలు కేటాయించలేదన్నారు. సీఎం కేసీఆర్ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలోని గ్రామాలు అభివద్ధి చెందుతున్నాయని తెలిపారు. దళిత బంధు పథకం కింద దళిత కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం కావాలని ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారుగ్రామంలోని దళితులు అందరికీ దళిత బంధు పథకం కింద ఆస్తుల ను అందజేయడం ఎంతగానో సంతోషంగా ఉందన్నారు. ఈ పథకం కింద వచ్చిన ఆస్తులను సక్రమంగా వాడుకొని ఆర్థికంగా కుటుంబాలు బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటేశం, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.