Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.బాలభాస్కర్రావు
- బాల కార్మిక నిషేధ చట్టం పై సమీక్ష సదస్సు
నవతెలంగాణ - భువనగిరి
బాల కార్మిక వ్యవస్థను రూపుమాపాలని భువనగిరి న్యాయ సేవా సమితి అధ్యక్షులు , జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి. బాల భాస్కర రావు అన్నారు. ప్రపంచ బాల కార్మిక నిషేధ దినోత్సవం సందర్భంగా ఆదివారం భువనగిరి కోర్టు ఆవరణలో సంబంధిత అధికారులతో, న్యాయవాదులతో బాల కార్మిక అంశాలపై, బాల కార్మిక నిషేధ చట్టంపై సమీక్షా సమావేశం, చైతన్య సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘంలో బాల కార్మిక నిషేధ చట్టం అమలు పరచడంలో కార్మిక శాఖతో పాటు సంబంధిత శాఖల అధికారులు పూర్తి స్థాయిలో సమన్వయంతో ప్రభావ వంతంగా పనిచేయాలన్నారు. తద్వార బాల కార్మిక వ్యవస్థ రూపుమాపాలని తెలిపారు, పాఠశాలలకు వెళ్లకుండా ఉన్న బాల బాలికలను గుర్తించి వారిని చదివేటట్లుగా చేయాలన్నారు. దీని కోసం సంఘ సేవా సంస్థలు విద్యాశాఖ వారికి సరైన సహకారం, చేయూత ఇవ్వాలన్నారు. ఆపరేషన్ ముస్కాన్ అమలుపరుచుటలో కషి చేయాలన్నారు.యాదాద్రి జిల్లాలో బాల బాలికల రెస్క్యూ హౌమ్స్ ఏర్పాటు చేయుటలో జిల్లా సంక్షేమ శాఖ కషి చేయాలని తెలిపారు. సీనియర్ సివిల్ జడ్జి వి.రజని, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి డి.నాగేశ్వర రావు, ఏసీపీ ఎస్. వెంకట్ రెడ్డి మాట్లాడుతూ బాలలను పనికి ఉపయోగించుకున్న లేదా దానిని ప్రోత్సహించిన పోలీసు వ్యవస్థ ఊరుకోదని సంబంధిత శాఖల ద్వారా పూర్తి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. యాదాద్రి జిల్లా బాలల సంరక్షణ అధికారి సైదులు మాట్లాడుతూ పిల్లల అమ్మకం, అక్రమ రవాణా, లైంగిక వేధింపులు, పనిలోకి ఉపయోగించటం వాటిపై నిరంతరం నిఘా ఉంచి పోలీసు వ్యవస్థ సమన్వయంతో చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.కోవిడ్ వలన అనాధలైన పిల్లలకు ప్రభుత్వ పథకాల ద్వారా చేయూత ఇస్తున్నట్టు తెలిపారు. భువనగిరి సహాయక కార్మిక అధికారి సయ్యద్ మొయిజుద్దీన్ మాట్లాడుతూ తమ శాఖ ద్వారా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పూర్తి కషి చేస్తున్నట్లు తెలిపారు.భువనగిరి న్యాయవాదుల సంఘం అధ్యక్షులు కేశవ రెడ్డి మాట్లాడుతూ ప్యానెల్ న్యాయవాదుల ద్వార అర్హులైన అందరికి ఉచిత న్యాయ సేవలు అందించడంలో భువనగిరి న్యాయవాదులు పూర్తి అంకిత భావముతో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమములో సఖి కేంద్రము నిర్వాహకులు ప్రమీల మాట్లాడుతూ తమ ఎన్జిఓ ద్వారా వివిధ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమములో చైల్డ్ లైన్ ,సఖి కేంద్రం వారు రూపొందించిన గోడ పత్రాలను న్యాయమూర్తులు, అధికారులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమములో ప్యానెల్ న్యాయవాదులు జైపాల్, రేణుక, శంకర్, చైల్డ్ లైన్ సిబ్బంది బాబు ,పారా లీగల్ వాలంటీర్లు కె. వెంకటేష్, శివలింగం, శ్రీశైలం, జయప్రకాష్ పాల్గొన్నారు.