Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి
నవతెలంగాణ -రామన్నపేట
వానాకాలం పంట సాగు సమస్య పరిష్కారానికి సమగ్ర ప్రణాళిక రూపొందించి రైతుల సమస్య పరిష్కరించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యలపై రైతు సంఘం ఆద్వర్యంలో సోమవారం స్తానిక తహసీల్థార్ కార్యాలయం ఎదుట దర్నా నిర్వహించి, అనంతరం డిప్యూటీ తహసీల్థారకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వానాకాలం మొదలైనా ఇప్పిటికీ అధికారుల్లో చలనం లేదన్నారు. నకిలీ విత్తనాలు లేకుండా సమగ్ర చర్య తీసుకోవాలని, అన్ని రకాల ఎరువులను అందుబాటులో ఉంచాలని కోరారు. ఏ మట్టిలో ఏ పంట వేస్తే అధిక దిగుబడి వస్తుందో రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలన్నారు. వరికి క్వాంటాకు 650 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రుణ మాఫీ ఒకే ధఫాలో చేసి ఎలాంటి శరతులు లేకుండా కొత్త రుణాలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటి సభ్యులు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, రైతు సంఘం మండల అధ్యక్షులు గన్నెబోయిన విజయభాస్కర్, నాయకులు కందుల హనుమంతు, బల్గూరి అంజయ్య,బావండ్లపల్లి బాలరాజు, అంబటి సురేందర్ రెడ్డి, ఎర్ర కాటమయ్య, ఎళ్ళ అనుగ్రారెడ్డి, దోమలపల్లి నర్సింహ్మ, వేముల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.