Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 40 తులాల పుస్తెల తాడులు , రూ.70వేల నగదు, రెండు బైకులు, రెండు ఫోన్లు స్వాధీనం
- వివరాలు వెల్లడించిన ఎస్పీ రెమా రాజేశ్వరి
నవతెలంగాణ -నల్లగొండ
ఇద్దరిని అంతర్ రాష్ట్ర చైన్ స్నాచర్లు ఇద్దర్ని అరెస్టు చేసి వారి వద్ద నుండి 40తులాల 24పుస్తెల తాడులను, 70వేల నగదు,రెండు బైకులు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్కు తరలించినట్లు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. ఈ నెల 15న మిర్యాలగూడ రూరల్ పరిధిలో ఆలగడప టోల్ ప్లాజా దగ్గర పోలీసులు వాహనాల తనిఖీలు చేయుచుండగా పల్సర్బైకుపై ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా తిరుగుతుండగా వారిని పట్టుకొని అదుపులోకి తీసుకొనివిచారించారు. సూర్యాపేట జిల్లా గుడుగుంట్ల గ్రామానికి చెందిన పల్లేపాక లెనిన్ , కల్లూరు గ్రామానికి చెందిన శోభన్ బాబు కొంతకాలంగా జల్సాలకు అలవాటుపడి సులువుగా డబ్బు సంపాదించాలని ఉద్దేశంతో గత కొంత కాలంగా చైన్ స్నాచింగ్లు వివిధ ప్రాంతాలలో ఇద్దరు కలిసి మోటర్ సైకిల్పై తిరుగుతూ ఒంటరిగా ఉన్న వద్ద మహిళా దగ్గరకు వెళ్లి మంచి నీళ్లు కావాలి అని, మా బర్లు (గేదెలు ) పోయినవి అని గ్రామాలలో తిరుగుతూ వాళ్లను మాటలతో మభ్యపెట్టి ఒంటరిగా ఉన్న సమయంలో మహిళల మెడలో ఉన్న బంగారు ఆభరణాలను బలవంతగా లాక్కొని అక్కడ నుండి మోటర్ సైకిల్ పై పారిపోతారు. వీరిపై రెండేండ్లుగా సూర్యాపేట జిల్లా, నల్గొండ జిల్లా ఖమ్మం జిల్లాలో మొత్తం 27 నేరాలు ఉన్నాయి. రెండేండ్లుగా నేరాలు చేస్తూ ఎవరికి పట్టుపడకుండా తప్పించుకు తిరుగుతున్న అంతర్ రాష్ట్ర చైన్ స్నాచర్లను చక చాకచక్యంగా పట్టుకున్న సీసీఎస్ డీఎస్పీ మొగలయ్యా ,సీఐ వెంకటేశ్వర్లు , మిర్యాలగూడ రూరల్ సీఐ సత్యనారాయణ, ఎస్ఐ నరసింహులు ,సీసీఎస్ సిబ్బంది మోషీన్ పాష ,విష్ణువర్ధను గిరి,ప్రబాకర్, కొండళ్, రాజారామ్, గణేష్లను ఎస్పీ అభినందించారు.