Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రారంభించినందున తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా విద్యాధికారి కానుగుల నర్సింహా తెలిపారు. సోమవారం మున్సిపల్ పరిధిలోని తంగడపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో బడిబాట కార్యక్ర మంలో భాగంగా మున్సిపల్ ఛైర్మన్ వెన్రెడ్డి రాజుతో కలిసి విద్యార్థులకు అక్షరభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఉబ్బు వరమ్మ వెంకటయ్య, హెచ్ఎంలు భాగ్యమ్మ, ప్రసాద్రావు, శ్రీరాములు, ఎస్ఎంసీ ఛైర్మన్ జహంగీర్, వైస్ఛైర్మన్ ఊదరి అనురాధ, సభ్యులు చంద్రకళ, సరిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.