Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ
నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో సోమవారం వివాదాస్పదంగా మారిన హైదరాబాద్ రోడ్ అండర్ రైల్వే బ్రిడ్జ్ పరిశీలించారు. ప్రస్తుతం నల్లగొండలో రోడ్డు విస్తరణ పనులు వేగంగా సాగుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ రోడ్ లో ఉన్న అండర్ రైల్వే బ్రిడ్జ్ను ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు విస్తరణకు సమాంతరంగా బ్రిడ్జి వెడల్పు పెంచాలని, పనుల ప్రారంభానికి ముందే, రైల్వే జనరల్ మేనేజర్ నల్లగొండ సందర్శించిన సందర్భంగా సమస్యను సభాదష్టికి తీసుకు పోయి రోడ్డు విస్తరణ కు సమానంగా 11 మీటర్ల వెడల్పు తోరెండు వైపులా అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని పిటిషన్ తో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్ విజ్ఞప్తి చేసారు.రాజ్యసభ సభ సభ్యులు ప్రజాప్రతినిధి గా తాను చేసిన విజ్ఞప్తి ని రైల్వే అధికారులు విస్మరించి అత్యంత ట్రాఫిక్ ఉండే ఇటువంటి ప్రాంతములో ఇరుకైన బ్రిడ్జి నిర్మాణం వల్ల ప్రమాదాలు జరిగి వాహనదారులప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని తక్షణమే ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు విస్తరణ కు అనుగుణంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కంచర్ల విజ్ఞప్తి మేరకు జిల్లా కలెక్టర్ బ్రిడ్జ్ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ చాంబర్ లో రైల్వే ఇంజనీరింగ్ అధికారులతో జరిగిన సమావేశంలో సమస్యను పరిష్కరించే విదంగా వెంటనే చర్యలు తీసుకోవసిందిగా కలెక్టర్ రైల్వే అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మెన్ అబ్బగోని రమేష్, కనగల్ ఎంపీపీ కరీం పాషా,పట్టణ పార్టీ అధ్యక్షలు, పిల్లిరామరాజు యాదవ్,కౌన్సిలర్లు జెరిపోతుల భాస్కర్ గౌడ్, వట్టిపల్లి శ్రీనివాస్, నాయకులు,సింగం రాంమోహన్,బకరం వెంకన్న, గాదె రాంరెడ్డి, అధికార ప్రతినిధి, సంధినేని జనార్దన్ రావు, కనగల్ పార్టీ అధ్యక్షులు యాదయ్య, మల్లేష్ గౌడ్, లక్ష్మయ్య, నాగరాజు పాల్గొన్నారు.