Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
- కలెక్టర్ టి.వినరుకష్ణారెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
ప్రజావాణిలో ప్రజలను నుండి స్వీకరించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా అధికారులను కలెక్టర్ టి.వినరుకష్ణారెడ్డి ఆదేశించారు.సోమవారం ప్రజావాణిలో అదనపు కలెక్టర్ యస్.మోహన్రావుతో కలసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూసమస్యలకు సంబందించిన వివరాలను మీ సేవా ద్వారా సరిగా నమోదు చేసుకోవాలని తెలుపుతూ అలాగే వచ్చిన ప్రతి అర్జీదారులకు భూసమస్యలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.జిల్లాలో వానాకాలం సీజన్ మొదలైనందున రైతులకు పంటసాగు విధానం అలాగే నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోకుండా రైతులకు వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండి అవగాహన కల్పించాలని సూచించారు.వివిధ మండలాల్లో ఉన్న భూసమస్యల దరఖాస్తులను తెప్పించి క్షున్నంగా పరిశీలించి అర్జీదారుల సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.ప్రజావాణిలో ఎక్కువగా భూ సమస్యలకు సంభందించిన దరఖాస్తులు అందాయని, ఈ రోజు ప్రజావాణిలో భూ సమస్యలకు సంబంధించి 18, ఇతర శాఖలకు సంబంధించి 09 దరఖాస్తులు మొత్తం 27 అందాయని అట్టి దరఖాస్తులను పరిశీలించి సంబంధిత శాఖల అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని, ప్రజావాణికి హాజరుకానీ అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఓ శ్రీదేవి, పర్యవేక్షకులు పులిసైదులు, సుదర్శన్రెడ్డి, జిల్లాఅధికారులు,అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు.