Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటటౌన్
బొమ్మిరెడ్డి రాఘవరెడ్డి ఆశయ సాధనకోసం ప్రతిఒక్కరూ కంకణబద్ధులు కావాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు.బుధవారం పెన్పహాడ్ మండలపరిధిలోని చీదెళ్ళ గ్రామంలో నిర్వహించిన బొమ్మిరెడ్డి రాఘవరెడ్డి సంతాప సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.రైతుకుటుంబంలో పుట్టి గ్రామంలో దొరలు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు రాఘవరెడ్డి అన్నారు.మండలంలో అనేక గ్రామాలలో నిర్బంధం వచ్చినప్పుడు ఆయా గ్రామాల్లో కార్యకర్తలకు అండగా నిలిచారన్నారు.నాటి కాంగ్రెస్ చేసిన దాడులు,దౌర్జన్యాలకు, నిర్బంధాలకు వ్యతిరేకంగా పోరాడి అనేక గ్రామాలలో పార్టీని బలోపేతం చేయడంలో ఆయన కృషి మరువలేనిదన్నారు.ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు చిన్నపంగ నర్సయ్య, వీరబోయిన రవి, సీఐటీయూ జిల్లా నాయకులు వల్లపుదాసు సాయికుమార్,మండల కమిటీ సభ్యులు మడ్డిఅంజిబాబు,ధనియాకుల శ్రీను, బొమ్మిరెడ్డి గోపిరెడ్డి, గుర్రం గోపాల్రెడ్డి, నాయకులు కొండమీది గోవిందరావు పాల్గొన్నారు.