Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీఎంఎస్ చైర్మెన్ వట్టెజానయ్య యాదవ్
నవతెలంగాణ-సూర్యాపేట
పంటఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి రైతులు గోదాములను సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా డీఎసీఎంఎస్ చైర్మెన్ వట్టె జానయ్య యాదవ్ కోరారు.ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కో అపరేటివ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ప్రాథమికవ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో రైతుగిడ్డంగుల చట్టంపై నిర్వహించిన శిక్షణ, అవగాహనా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులు పండించిన పంటలను గిట్టుబాటు ధర వచ్చేంతవరకు గోదాములలో నిల్వ చేసు కోవచ్చ న్నారు.గోదాములను నిర్మించుకునేందుకు ప్రభుత్వం 33 శాతం రాయితీ అందజేస్తుంద న్నారు.ప్రభుత్వం నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్న గోదాములలోనే రైతులు పంటను నిల్వ చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి శ్రీధర్,ఇనిస్టిట్యూట్ ఆఫ్ కోఆపరేటివ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం డైరెక్టర్ శ్యామ్కుమార్, అసిస్టెంట్ రిజిస్టర్ కృష్ణ, అశోక్,సీఈఓ వాసు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.