Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూములు సేకరించడం లేదు:ఆర్డీఓ
నవతెలంగాణ-మిర్యాలగూడ
మా భూములు మాకు కావాలని.... పారిశ్రామిక పార్కు రద్దుచేయాలని బాధిత రైతులు రైతులు బుధవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట ఖమ్మం రోడ్డుపై రాస్తారోకో చేశారు.పోలీసులు నచ్చజెప్పడంతో రాస్తారోకో విరమింపజేసి కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.పారిశ్రామిక పార్కు వద్దని.... ప్రాణాలైనా ఇస్తాం.. భూములను వదులుకోము.. మాకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ మండలంలోని ఆలగడప గ్రామంలో పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ భూములను సేకరిస్తుందని తెలిపారు ఆలగడప, రాయనిపాలెం,అవంతీపురం, జాలుబాయితండాకు చెందిన 413 మంది రైతుల వ్యవసాయ భూమి 421.35 ఎకరాలు సేకరించినట్లు గెజిట్ విడుదల చేశారని తెలిపారు.రైతులకు సమాచారం ఇవ్వకుండా మా అనుమతి తీసుకోకుండా ప్రభుత్వం భూసేకరణ చేపట్టడం సరికాదన్నారు.వెంటనే భూసేకరణ 10ఏ గజిట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.భూములు క్రయ విక్రయాలు జరక్కుండా సర్వే నెంబర్ ఫ్రీజ్ చేశారని వెంటనే ఫ్రిజ్ను తొలగించాలని డిమాండ్ చేశారు.మాకు జీవనాధారమైన భూమిని ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటే ఆత్మహత్యలే శరణ్యమని వాపోయారు.మా భూములు మాకు కావాలని కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని తేల్చి చెప్పారు.ఆర్డీఓ రోహిత్సింగ్ రైతులకు భరోసా కల్పించారు.ప్రస్తుతం భూసేకరణ నిలిచిపోయిందని,పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయడం లేదని చెప్పారు.సర్వే నెంబర్లపై ఉన్న ఫ్రిజ్ను తొలగించేందుకు కలెక్టర్కు నివేదిక పంపిస్తానని హామీ ఇచ్చారు.దీంతో రైతులు ఆందోళన విరమించారు.రైతులు ఆందోళనకు ఎస్ఎఫ్ఐ,కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు.