Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ
భారత ఆహార సంస్థ గొల్లగూడ గోదాం లో పనిచేస్తున్న క్యాజువల్ కార్మికుల ఉపాధి కాపాడాలని తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేసి జిల్లా జాయింట్ కలెక్టర్ వనమాల చంద్రశేఖర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ 30ఏండ్లుగా ఎఫ్సీఐ గొల్లగూడ గోదాం నందు మహిళలు 40 మంది ,పురుషులు 20 మంది మొత్తం 60మంది క్యాజువల్ కార్మికులుగా పనిచేస్తున్నారన్నారు .ప్రస్తుతం మహిళలు 10 మంది పురుషులు 10 మంది మొత్తం 20 మందికి మాత్రమే పని ఉంటుందని మిగతా 40 మందికి పని లేదని ఎఫ్సిఐ , డిఎం చెప్పడంతో పని కోల్పోయి రోడ్డు మీద పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు .అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న వీరిని పని నుండి తొలగించడం సరికాదన్నారు. కలెక్టర్ జోక్యం చేసుకొని క్యాజువల్ కార్మికుల ఉపాధిని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఫ్సీఐ హమాలి వర్కర్స్ యూనియన్ కార్యదర్శి పల్లె నగేష్ క్యాజువల్ వర్కర్స్ మాండ్ర శ్రీనివాస్ బోయపల్లి చంద్రమ్మ మారెమ్మ లింగమ్మ ధనమ్మ రాములమ్మ సత్యమ్మ యాదమ్మ సైదమ్మ రాజేశ్వరి సరిత కవిత అలివేలు తదితరులు పాల్గొన్నారు.