Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10000 మందితో బహిరంగ సభ గోదా శ్రీరాములు
యాదగిరిగుట్ట:సీపీఐ యాదాద్రి భువనగిరి జిల్లా మూడో మహాసభలు ఆగస్టు 22 23 తేదీల్లో జిల్లా కేంద్రమైన భువనగిరి లో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు తెలిపారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మండల కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 22వ తేదీన భువనగిరిలో 10,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. 23న రాయగిరిలో ప్రతినిధుల సభ జరుగుతుందని తెలిపారు. జిల్లా మహాసభలో జిల్లాలోని రిజర్వాయర్లకు పూర్తి నిధులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య దోరణిని ఏండ గడతమన్నారు.రైతులకు ఆర్ఆర్ ప్యాకేజీ కింద నష్టపరిహారం ఇచ్చే విషయంపై చర్చిస్తామన్నారు సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బండి జంగమ్మ ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు గోరేటి రాములు సిపిఐ మండల కార్యదర్శి జిల్లా జానకి రాములు సహాయ కార్యదర్శి పేరబోయిన మహేందర్ మండల కార్యవర్గ సభ్యులు పేరబోయిన పెంటయ్య బబ్బురు శ్రీధర్ పేరబోయిన బంగారి,గోపగాని రాజు ,మునుకుంట్ల నరసమ్మ ,ఆరే పుష్ప తదితరులు పాల్గొన్నారు.