Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం నకిరేకల్ పట్టణంలో 1 కోటి రూపాయలతో నిర్మితమైతున్న శ్రీ శ్రీ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో జరుగుతున్న పనులను పరిచిలించి పక్కన ఉన్న మినీ ట్యాంక్ బండ్ కట్టపై ఉన్న చెట్లను తొలగించాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు కనకదుర్గ దేవాలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు, ఆలయ ప్రతినిధులు పాల్గొన్నారు.