Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్కుమార్రెడ్డి
నవతెలంగాణ-భువనగిరిరూరల్
త్రిబుల్ ఆర్ రింగ్రోడ్లో భూములు కోల్పోయిన రైతులను మంత్రి వస్తున్నారని కారణం చేత ఉదయం వారి ఇంటి వద్దకు వెళ్లి అరెస్టు చేయడం సరి కాదని, అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్కుమార్రెడ్డి తెలిపారు.గురువారం ఆయన భువనగిరి పోలీస్స్టేషన్ కు వెళ్లి భూనిర్వాసితులకు మద్దతు తెలిపి మాట్లాడారు.రాయగిరి గ్రామం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో ఉందని త్రిబుల్ ఆర్ రింగురోడ్డు భువనగిరి అనుకొని ఉన్న మున్సిపాలిటీ పరిధిలోని గ్రామం గుండా వెళ్లడం సరైనది కాదన్నారు. గతంలో విద్యుత్తు లైను, కాలేశ్వరం ప్రాజెక్టు కాలువలు, జాతీయ రహదారిలో భూములు కోల్పోయారని ప్రస్తుతం త్రిబుల్ ఆర్ రింగ్ రోడ్డు ఈ గ్రామం గుండా పోవడంతో సుమారు 300 నుంచి 400 ఎకరాలు కోల్పోయే పరిస్థితి నెలకొందన్నారు. భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి తన సొంత భూమి పోతుందనే ఉద్దేశంతో త్రిబుల్ ఆర్ భూమి అలైన్మెంట్ మార్చారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కోట పెద్ద స్వామి, ఎంపిటిసి పాశం శివానంద్, పట్టణ అధ్యక్షులు బీసు కుంట్ల సత్య నారాయణ, నాగిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ చుక్క స్వామి, అరెస్ట్ అయిన వారిలో అవిశెట్టి పాండు యాదవ్, మల్లేశం గౌడ్ తో పాటు పలువురు ఉన్నారు.