Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకవీడు
మండలకేంద్రంలో కేవీపీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ సంఘం జెండాను జిల్లా అధ్యక్షుడు మర్రి నాగేశ్వర్రావు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మగౌరవం, కుల నిర్మూలనే లక్ష్యంగా సమ సమాజ స్థాపన కోసం కేవీపీఎస్ ఏర్పడిందన్నారు.సమాజంలో కులం, కట్టుబాట్లను అధిగమించడానికి కేవీపీఎస్ సుదీర్ఘ కృషి చేస్తుందన్నారు. కులాంతర హత్యల నివారణ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు కందగట్ల అనంతప్రకాష్,కేవీపీఎస్ మండలకార్యదర్శి పరంగి కృష్ణ, మీసాలఏసురత్నం, వీరబాబు, జీవన్కుమార్, వీరభద్రం, జిల్లా నగేష్, చంటి పాల్గొన్నారు.