Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూరు
గోపాలమిత్రలకు 30 శాతం పీఆర్సీ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పశు సమర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చిత్రపటానికి గురువారం మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో గోపాల మిత్రులు పాలాభిషేకం చేశారు మంత్రి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి చేశారు. ఈ కార్యక్రమంలో గోపాలమిత్రుల సంఘం యాదాద్రి జిల్లా గౌరవాధ్యక్షుడు వంగూరి గోవింద్, కోశాధికారి బండి కొమురయ్య, జిల్లా కమిటీ మెంబర్ మెండె సతీష్, గోపాల మిత్రులు కిష్టయ్య, అంజద్, పి.సత్యనారాయణ, బి.మల్లేష్, శ్రీనివాస్, నరేష్, శ్రీనివాసులు పాల్గొన్నారు.