Authorization
Wed March 19, 2025 12:06:45 pm
నవతెలంగాణ -రామన్నపేట
మండలంలోని లక్ష్మాపురం గ్రామంలో ప్రమాదవశాత్తు శుక్రవారం తాటి చెట్టు పై నుండి గీత కార్మికుడు బత్తుల రాములు కిందపడి తీవ్ర గాయాలయ్యాయి. గీత వృత్తిలో బాగంగా తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు చెట్టు నుండి జారిపడి తీవ్రగాలయ్యాయి. వెంటనే స్థానిక ప్రభత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్కు తరలించారు. రాములును గీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బావండ్లపల్లి బాలరాజు పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గీత వృత్తినే ఆదారంగా చెసుకోని జీవనం సాగిస్తున్న రాములు కు మెరుగైన వైద్యం కోసం తక్షణ సాయం కింద 5లక్షలు ప్రభుత్వం అందివ్వాల న్నారు. ఆయన వెంట గీత కార్మిక సంఘం మండల అద్యక్ష, కార్యదర్శుల ఎర్ర రవిందర్, పులి భిక్షం, మునుకుంట్ల లెనిన్, కూనూరు మల్లేషం, సత్యం ఉన్నారు.