Authorization
Fri March 07, 2025 01:30:52 pm
- జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి
నవతెలంగాణ-నార్కట్పల్లి
పదో తరగతి వార్షిక పరీక్షలలో10/10 సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి బీ. బిక్షపతి పేర్కొన్నారు. మండల పరిధిలోని ఎల్లారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాయంత్రం క్లాసులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు రాబోవు పదో తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఉపాధ్యాయుల సూచనలు పాటించాలని చెప్పారు. ప్రతి పాఠశాలలో 100శాతం విద్యార్థులు ఫలితాలు సాధించే విధంగా కృషి చేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.