Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మిర్యాలగూడ టౌన్ : మెకానిక్ షెడ్లు ఆటోనగర్కు తరలించాలని సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం ఆర్డీఓ కార్యాలయంలోని డీఏఓ రఘునాధ్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పట్టణంలోని ఖమ్మం, నల్లగొండ, సాగర్రోడ్డు వెంట మెకానిక్షాపులున్నాయని, వారికి గాను గతంలో ఆటోనగర్ ఏర్పాటు చేశారన్నారు. రోడ్డు వెంట ఉండటంతో భారీ వాహనాలు రోడ్లపై నిలుపుతున్నారని, దీని వల్ల ట్రాఫిక్ సమస్య నెలకొందన్నారు. మెకానిక్ షెడ్లను ఆటోనగర్కు తరలిస్తే కొంతమేరకు ట్రాఫిక్ సమస్య పరిష్కారమౌతుందన్నారు. వినతిపత్రం సమర్పించిన వారిలో మండల కార్యదర్శి సమీఖాద్రి, పద్మ, సులోచన, ఎస్ఎస్.పాల్, జలీల్బాబా, ఎస్డి.సైదా, మిడతపల్లి సైదులు, యాదగిరి పాల్గొన్నారు.