Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాదగిరిగుట్ట
మండలపరిధిలోని చొల్లేరు గ్రామంలో ఉన్న హెరాల్డ్ పరిశ్రమను తక్షణమే మూసివేయాలని వంగపల్లి గ్రామస్తులు బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కానుగు లక్ష్మణ్ మాట్లాడుతూ ఫార్మా పరిశ్రమ ద్వారా విచ్చలవిడిగా వ్యర్థాలు తరలివస్తుండడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. ఇప్పటికైనా అధికారులు కల్పించుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్చేశారు. ఈ కార్యక్రమంలో వంగపల్లి గ్రామస్తులు కానుగు రాజేశ్, బండి మహేశ్, ఎడవెల్లి మహేశ్, రాజశేఖర్ పాల్గొన్నారు.