Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-క్లాక్టవర్
1న జరిగే టీసీపీఎస్ఈఏ ధర్నాను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు అలుగుపల్లి పాపిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆ జిల్లా కార్యాలయంలో టీ సీపీఎస్ ఈఏ ఆధ్వర్యంలో ధర్నా పోస్టర్ను ఆవిష్కరించారు.ఈ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టరేట్ ముందు నిర్వహించే ధర్నా కార్యక్రమంలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీసీపీఎస్ఈఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగవళ్ళి ఉపేందర్, బొమ్మన బోయిన శ్రీనివాస్, భూలక్ష్మీ, టీపీయూఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య, కార్యదర్శి ముత్యాల రాంమోహన్లు పాల్గొన్నారు.