Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ టౌన్
కార్మిక సమస్యలు పరిష్కరిం చడంలో సంఘం క్రియాశీలకంగా పని చేస్తుందని విద్యుత్ 327 యూనియన్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు జి. ముత్తయ్య అన్నారు. ఆ సంఘం ఆధ్వర్యంలో బుధవారం డీఈ కార్యాలయం నుంచి పట్టణంలో భారీ బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో క్రియాశీలకంగా పని చేస్తున్నామన్నారు. ఒప్పంద కార్మికులను రెగ్యులర్ చేయించడంలో సంఘం కృషి ఉందన్నారు. విద్యుత్ కార్మికుల ఎన్నికల్లో సంఘం తరపున పోటీ చేసిన వారిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి రాజేశ్వర్రావు, కార్యదర్శి అమర్కుమార్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ శంకర్నాయక్, స్కైలాబ్నాయక్, కరీం పాల్గొన్నారు.