Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- చిట్యాల
ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ ఖర్చుల అంశాలపై చర్చించాల్సిన సమావేశానికి ఎంపీపీ, జెడ్పీటీసీ మినహా మిగతా ప్రజాప్రతినిధుల హాజరుకాలేదు. అయినప్పటికీ హెచ్డీఎస్ సమావేశాన్ని నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఆస్పెటల్ అభివృద్ధి అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆస్పత్రి పరిధిలోని సర్పంచులు , ఎంపీటీ సభ్యులు మహిళా సంఘం నాయకురాలు హాజరుకావాల్సి ఉండగా ఒక్కరూ కూడా హాజరుకాకపోవడం గమనార్హం ఆస్పత్రి అభివృద్ధి కోసం వచ్చే నిధులను ఎవిధంగా ఖర్చు పెట్టాలో ఆస్పత్రి అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించాల్సిన సమావేశానికి స్థానిక ప్రజాప్రతినిధులు రాకపోవడం పట్ల ప్రజాఆరోగ్యంపై వారికి ఉన్న శ్రద్ధ ఏపాటిదో తెలుస్తుంది. ఈ సమావేశంలో వచ్చిన ఒక లక్ష 92, 500 రూ.లను ప్రాధాన్యత అంశాల ప్రకారంగా ఖర్చు చేయనున్నట్టు ఎంపీపీ బట్టు అరుణ ఐలేష్ తీర్మానించారు. వచ్చే సమావేశానికైనా ప్రజాప్రతినిధులు అందరు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారి డా.కిరణ్ను ఆదేశించారు.