Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- క్లాక్టవర్
సెప్టెంబర్ 5న నిరుద్యోగ జేఏసీ మహా పాదయాత్ర నిర్వహిస్తున్నట్టు ఆ సంఘం జిల్లా చైర్మన్ పాల్వాయి రవి, అధ్యక్షులు నిలకంఠంరవి ప్రధాన కార్యదర్శి రావిరాల వరప్రసాద్ బుధవారం పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి మూడేండ్లుగడిచినా నిరుద్యోగులకు ఎలాంటి న్యాయం జరగలేదని నోటిఫెకషన్ వేయుకుండా కేవలం పేపరు ప్రకటనకే పరిమితమయ్యిందని డీఎస్సీ నిర్వహించి ఐదేండ్లు కావస్తున్నా మల్లి నోటిఫికేషన్కు నోచుకోలేదని వేలాది మంది విద్యార్థులు డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారన్నారు. దాదాపు నాలుగేండ్లనుంచి ఎదురుచూస్తు డీఎస్సీ ఇక వేయరని నిరాశచెంది మెదక్ జిల్లా నారాయణఖేడ్కు చెందిన రామకృష్ణ అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. రామకృష్ణ ఇంటినుంచి ఓయూ వరకూ సెప్టెంబర్ 5న నిరుద్యోగుల మహాపాదయాత్ర నిర్వహిస్తున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో కట్టెల శివ, చుక్క సైదులు, దుబ్బ శ్రీను, శ్రీకాంత్ , దండెంపల్లి సత్తయ్య, అంజిరెడ్డి, శివశంకర్ పాల్గొన్నారు.