Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మర్రిగూడ :మండలంలోని ఇందూర్తి గ్రామ వీఆర్ఏ కతియా(50) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న పలు పార్టీల నాయకులు ఆమె మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించి సంతాపం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దంటు జగదీశ్వర్ మృతురాలి కుటుంబానికి రూ.10 వేల ఆర్థికసాయం అందజేశారు. సంతాపం తెలిపిన వారిలో సీఐటీయూ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, మాజీ సర్పంచ్ శ్రీలత సురేం దర్రెడ్డి, చెరుకు లింగంగౌడ్, నగేశ్, అబ్బయ్య, హుస్సేన్ ఉన్నారు.