Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
తాజా మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావును గెలిపించాలని కోరుతూ ఆయన తనయుడు, ఎన్బీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నల్లమోతు సిద్ధార్థ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శుక్రవారం స్థానిక అశోక్నగర్, వాసవీనగర్, తదితరప్రాంతాల్లో గడపగడపకూ తిరిగి ఓటర్లను కలుసుకొని ప్రచారం చేశారు. పట్టణంలో జరిగిన వివిధ అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు వివరించారు. ఈ సందర్భంగా సిద్ధార్థ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తన తండ్రి భాస్కర్రావును మరోసారి గెలిపించాలని కోరారు. నాలుగున్నరేండ్లకాలంలో మిర్యాలగూడ ప్రాంతం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. మిగిలిన పనులు పూర్తి చేసేందుకు మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని కోరారు. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి కుర్ర విష్ణు, కౌన్సిలర్ అంజన్రాజు, మాజిద్, టీఆర్ఎస్ పట్టణ యువజన అధ్యక్షులు జావీద్, ఎన్బీఆర్ ఫౌండేషన్ సభ్యులు చీదెళ్ల శ్రీనివాస్, తిరుమలగిరి వజ్రం పాల్గొన్నారు.