Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు నేడు జరిగే రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు తిరుమలగిరి అశోక్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానికంగా సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనున్న బీసీలను అన్ని రాజకీయ పార్టీలు ఓటుబ్యాంకుగానే వాడుకుంటున్నాయి తప్ప చట్టసభలకు పంపడంలో పూర్తి నిర్లక్ష్యంగా వహిస్తున్నాయన్నారు. మహాకూటమి పేరుతో ఎన్నో ఏండ్లుగా ఆయా నియోజకవర్గాల్లోనున్న బీసీలను కాదని అగ్రవర్ణాలకు సీట్లు కేటాయించడం బీసీల అణిచివేతకు నిదర్శనమన్నారు. కేవలం బీసీ నాయకులున్న నియోజకవర్గంలోనే మహాకూటమి పేరుతో అగ్రవర్ణాలకు సీటు కేటాయించడం దారుణమన్నారు. నేడు జరిగే బంద్తోనైనా పార్టీలు మేల్కొని బీసీలకు టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో రాచూరి మహేశ్, దాసరాజు ప్రసాద్, వెంకటేశ్, రాకేశ్, నాగేందర్, కృష్ణ, రాము, శ్రీను పాల్గొన్నారు.
బంద్కు మద్దతు
రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అసెంబ్లీ టికెట్ల విషయంలో బీసీలను విస్మరించినందుకు నిరసనగా నేడు జరిగే బంద్కు మద్దతు తెలుపుతున్నట్టు సామాజిక తెలంగాణ బీసీ ఐక్యకూటమి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరాజు జయరాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు, బీసీలు భాగస్వాములు కావాలన్నారు. ఇటీవల టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో బీసీలకు అన్ని విధాల అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ప్రకటన విడుదల చేసిన వారిలో రాష్ట్ర కార్యదర్శి మామిడాల ఉపేందర్, జిల్లా అధ్యక్షులు లింగంపల్లి చిరంజీవి, నియోజకవర్గ అధ్యక్షులు ఎస్కె.జాని, ముజీబ్, అప్పారావు, విజయలకిë, లింగయ్య, అంజయ్యగౌడ్, శ్రీనివాస్ ఉన్నారు.