Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
సమాజంలో అత్యున్నతమైన వృత్తిలో జర్నలిజం ఒకటని పలువురు జర్నలిస్టులు అన్నారు. జాతీయ విలేకరుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక ప్రెస్క్లబ్లో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రజల సమస్యలపై నిరంతరం దృష్టి పెట్టి పాలకులు, అధికారుల వైఖరులపై ప్రశ్నించే ఆయుధం జర్నలిజం అన్నారు. కానీ విలేకరుల జీవితాలు నేడు ఎంతో దుర్భరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనాలు జీవన ప్రమాణాలు లేని వృత్తిగా నేడు మారిందన్నారు. రానున్న పాలక ప్రభుత్వాలు సమాజానికి దిక్సూచిలాంటి జర్నలిజం విలువలు కాపాడుతూ కనీస జీవన ప్రమాణాలు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో పేర్ల వెంకటయ్య, ఎ. మట్టయ్య, ఎల్. ఈశ్వర్రెడ్డి, ఎ. వెంకట్, బాబు, సుమన్, రవికుమార్, శ్యామ్, సాగర్, గోపి పాల్గొన్నారు.