Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కనగల్:మహాకూటమి తెలంగాణ ద్రోహుల కూటమని ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని పోనుగోడు, కూరంపల్లి, యడవెల్లి, బచ్చన్నగూడెం గ్రామాల్లో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. కేసీఆర్ను తిరిగి సీఎం చేయకుంటే రాష్ట్రం రాబందుల పాలవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్రెడ్డి, మార్కెట్ చైర్మన్ కరీమ్పాషా, మాలే శరణ్యరెడ్డి, ఎంపీపీ కె.కృష్ణయ్య, మందడి రామచంద్రారెడ్డి, మేక ఉమారెడ్డి, శంకర్, సహదేవరెడ్డి, క్షత్రయ్య, ఐతగోని యాదయ్య పాల్గొన్నారు.