Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శాలిగౌరారం :ఈనెల 23న నియోజక వర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహించ నున్నట్టు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గాదరి కిషోర్ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించిన అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వ పథకాలే పార్టీని గెలిపిస్తాయన్నారు. ఈ నెల 23న నిర్వహించే టీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ హాజరువు తున్నారని, సభను విజయ వంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు కట్టా వెంకట్రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్ గుండా శ్రీనివాస్, జడ్పీటీసీ ఐతగోని సునీత వెంకన్న, ఎంపీపీ లోకసాని లావణ్య రంగారెడ్డి, సకినాల నర్సయ్య, ఎర్రా కృష్ణామోహన్, సుంకరి కరుణ వీరయ్య, శేఖర్బాబు, వేణుగోపాల్రెడ్డి, రామచంద్రు, సోమకోటి, వెంకన్న, దాసరి నతానీయేల్, కృష్ణ, ఎల్లయ్య పాల్గొన్నారు.