Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ మేనిఫెస్టో ధ్యేయమని మహాకూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని మంగళపల్లి గ్రామంలో ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేండ్ల కాలంలో పేద ప్రజలను విస్మరించి కేసీఆర్ కుటుంబం బాగుపడిందన్నారు. మాజీ సర్పంచ్ ప్రగడపు నవీన్రావు సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన గుండాల సోమయ్య, తమ్మినేని వెంకటేశ్వరావు, చింతల వీరయ్య, ఐతగోని వెంకన్న, గుణగంటి వెంకటేశ్వర్లు, పూల సైదులు, సుధాకర్, పగిళ్ల జానయ్య, పెరుమాళ్ల రాజేశ్, బొయినపల్లి శ్రీనివాసరావు, బి.స్టాలిన్రావు, సుదీర్రావు, అంతటి జానయ్య, రాచకొండ వెంకన్న, చింతల ముత్తయ్య, తదితరులు సుమారు 250 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు సందినేని కిషన్రావు, భుజంగరావు, ఐతగోని వెంకటేశ్వర్లు, గంగధర్రావు, చిక్కుల సైదులు, చిట్టిమల్ల మంగమ్మ, తండు సుధాకర్, రామలింగయ్య, కొప్పుల వెంకన్న పాల్గొన్నారు.
చిరుమర్తిని గెలిపించాలని ప్రచారం
మహాకూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్యను గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని 6వ వార్డులో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పన్నాల రంగమ్మరాఘవరెడ్డి, పట్టణ అధ్యక్షుడు నడికుడి వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ గుర్రం గణేశ్, నాయకులు కొండ జానయ్య, రాచకొండ శ్రవణ్, మాజీ ఉప సర్పంచ్ బ్రహ్మదేవర రమేశ్, వార్డు సభ్యులు యాతాకుల కిరణ్, చౌగోని విద్యావతి శంకర్, మొయీజ్, పల్లె విజరు, రాచకొండ సునీల్, ఆరుట్ల శ్రవణ్ పాల్గొన్నారు.