Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఈఓ సరోజినిదేవి
నవతెలంగాణ-హాలియా
విద్యార్థుల్లో దాగున్న సృజనాత్మకశక్తులను వెలికితీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని జిల్లా విద్యాశాఖాధికారి పాలడుగు సరోజినిదేవి అన్నారు. శుక్రవారం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి సైన్స్, గణిత, పర్యావరణ వైజ్ఞానిక ప్రదర్శనను ఆమె ప్రారంభించి మాట్లాడారు. దేశంలో శాస్త్రవేత్తల కొరత చాలా ఉందన్నారు. బాల్యంలోనే నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలన్నారు. వైజ్ఞానిక ప్రదర్శనల ఏర్పాటు వల్ల సైన్స్పై విద్యార్థులకు ఆసక్తి కల్గుతుందన్నారు. జిల్లా నలుమూలల నుంచి ప్రభుత్వ, ప్రయివేటు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ప్రాథమికోన్నత, కేజీబీవీ పాఠశాలల నుంచి వివిధ విభాగాల నుంచి దాదాపు 400 ప్రదర్శనలు వచ్చాయన్నారు. వైజ్ఞానిక ప్రదర్శన విజయవంతం కోసం ఉపాధ్యాయులచే రిజిస్ట్రేషన్, ఫైనాన్స్, డాక్యుమెంట్, ప్రెస్, బారికేడ్, వాటర్, ట్రాఫిక్, వసతి, భోజనం, ఆహ్వానం, స్టేజీ, సాంస్కృతిక, విద్యుత్, ప్రదర్శనల ఏర్పాటు, డిస్ప్లే, హెల్త్, జ్యూరీ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ప్రారంభానికి ముందు విద్యార్థులచే ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. అనుముల మండల విద్యాధికారి తరి రాము సమన్వయకర్తగా వ్యవహరించిన కార్యక్రమంలో జిల్లా విద్యాశిక్షణ సంస్థ ప్రిన్సిపాల్ నర్సింహ, డీఎస్పీ శ్రీనివాస్, డీసీఈబీ కార్యదర్శి పున్న రవీందర్, జిల్లా సైన్స్ అధికారి వనం లకిëపతి, సెక్టోరియల్ అధికారులు కె. అంజిరెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఓపెన్స్కూల్ కోఆర్డినేటర్ మంగళ, జీసీడీఓ అరుణ, హాలియా సీఐ ధనుంజయగౌడ్, ఎస్సై సతీశ్కుమార్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గుండా కృష్ణమూర్తి, కె. శ్రీనివాస్, సైదానాయక్, చినపాక వెంకటేవం, అంకయ్య, ఝాన్సీ, ఆనందగిరి, ఉపాధ్యాయ సంఘం నాయకులు రాపోలు పరమేశ్, పెరుమాళ్ల వెంకటేశం, సదానందం, నెమలి వెంకట్రెడ్డి, అద్దంకి సునీల్, గుర్రం ప్రభాకర్రెడ్డి, చింతల వెంకటేశ్వర్లు, రామచంద్రారెడ్డి, ఆవుల మధుసూదన్, సక్రునాయక్, సైదయ్య, వసంతరావు, మద్దెల ప్రసాద్, జలీల్, కట్టా మధు, మన్నెం వెంకటేశ్వర్లు, వెంకట్రామిరెడ్డి, దేవేందర్, కోనేటి నర్సింహా, శంకర్, నల్లమేకల వెంకయ్య, రామ్మోహన్రెడ్డి, శ్యామ్ప్రసాద్, రవీందర్, వెంకటరమణారెడ్డి, సత్తయ్య, గొట్టిముక్కల సరిత నరేశ్, శ్రీకళారామ్మూర్తి, ప్రకాశ్, వెంకన్న, చంద్రశేఖర్ పాల్గొన్నారు.