Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
టీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమౌతుందని ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మంగళవారం మండలంలోని ఆలగడప, కొత్తగూడెం, గూడూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఊట్లపల్లిలో వివిధ పార్టీల నుండి వంద మంది కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న కేసీఆర్కు ప్రజలు అండగా నిలవాలని, సర్పంచ్ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కేసీఆర్ నాయకత్వంలోనే గ్రామాలకు ప్రత్యేక నిధులొస్తాయన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తామన్నారు. ఇప్పటికే గ్రామజ్యోతి, మన ఊరు-మన ప్రణాళికతో గ్రామాల అభివృద్ధికి కృషి చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మండల అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ నూకల సరళ, జడ్పీటీసీ నాగలకిë సైదయ్య, మన్నెం మనోహర్రెడ్డి పాల్గొన్నారు.