Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దవూర
మండలంలోని పర్వేదుల గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు 50 మంది కార్యకర్తలు టీఆర్ఎస్కేవీ రాష్ట్ర కార్యదర్శి ఎస్కె.బషీర్ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్ వంటి పథకాలు ప్రవేశపెట్టడంతో మండలంలోని అనేక గ్రామాల నుంచి కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. పార్టీలో చేరిన వారిలో కాశీ, కోటేశ్, విష్ణు, భాషాతోపాటు, మరో 50 మంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దుబ్బ రవి, వెంకటయ్య, చిన్ని, మనీషా, రాంబాబు, భిక్షం, వెంకన్న పాల్గొన్నారు.