Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వేములపల్లి
రాజకీయాలకతీతంగా గ్రామాభివృద్ధికి పాటుపడతానని కాంగ్రెస్, టీడీపీ బలపరిచిన మొల్కపట్నం సీపీఐ(ఎం) సర్పంచ్ అభ్యర్థి పాదూరి శశిధర్రెడ్డి అన్నారు. మంగళవారం ఆ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సర్పంచ్గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానన్నారు.ప్రజలు తిరిగి గ్రామాభివృద్ధికి తన ఎన్నికను ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పన కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. గ్రామాల్లో అంతర్గత రోడ్లు, డ్రయినేజీ, వీధి దీపాలు, కార్మికులు, కూలీల, రైతుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానన్నారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కంచరకుంట్ల దయాకర్రెడ్డి, కొలిపాక నాగేందర్, వార్డు సభ్యులు కళమ్మ, జయరాములు, బొమ్మకంటి జానకిరాములు, శైలజ, పాపిరెడ్డి, లింగయ్యయాదవ్, హరికృష్ణ పాల్గొన్నారు.