Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ గౌరవ్ఉప్పల్
నవతెలంగాణ-నార్కట్పల్లి
జాతీయ రహదారిపై నిత్యం జరుగుతున్న ప్రమాదాల పట్ల వాహనదారులు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని ఏపీలింగోటం జాతీయ రహదారి 65 పై జరిగిన వైద్య విద్యార్థినిల ప్రమాద సంఘటనా స్థలాన్ని, కామినేని వైజంక్షన్ రోడ్డును ఆయన పరిశీలించారు. వైజంక్షన్లో జరుగుతున్న బ్రిడ్జీ నిర్మాణ పనుల గురించి జీఎమ్ఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామినేని ఎదురుగా ఉన్న ఓపెన్ డివైడర్ను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించారు. వాహనదారులు ప్రమాదం జరిగే ప్రాంతాలలో వేగాన్ని అదుపులో ఉంచుకుని వాహనాన్ని నడపాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించాలని ఇద్దరు మించి ప్రయాణించకూడదని సూచించారు. ఆయన వెంట తహశీల్దార్ వి. శ్రీదేవి, ఎస్ఐ విజరుకుమార్, కామినేని పీఆర్జీఎం శ్రీదర్రెడ్డి, జీఎమ్ఆర్ అధికారులు తదితరులు ఉన్నారు.