Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్
నవతెలంగాణ-క్లాక్టవర్
జిల్లాలో ఈ నెల 25న మిర్యాలగూడ డివిజన్లో జరుగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా నోడల్ అధికారులు, మండల పర్యవేక్షక అధికారులు, ఎంపీడీఓలు, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ట్రాన్స్కో, ఆర్డబ్ల్యూస్ ఇంజనీర్లు, జిల్లాస్థాయి మాస్టర్ ట్రైనర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. పంచాయతీ ఎన్నికలలో ఎంపీడీఓ, తహశీల్దార్ తో పాటు ఇతర మండల అధికారులు కూడా పాలు పంచుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణకు తగిన విధంగా అధికారులు, ఉద్యోగులు ఉన్నారాలేదో, మెటీరియల్ కొరత వుందోలేదో సరి చూసుకోవాలన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగిన పంచాయతీ నుండి తక్కువగా వున్న మండలాలకు ఎన్నికల విధులు కేటాయించాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లో పోలింగ్ ముందు రోజు ,పోలింగ్ కౌంటింగ్ ముగిసిన అనంతరం భోజనం ఏర్పాట్లు చేయాలని అన్నారు. కౌంటింగ్,అనంతరం గొడవలు జరిగే ప్రాంతాలు వుంటే పోలీస్ సిబ్బంది బందోబస్తు, శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. కౌంటింగ్, పోలింగ్ ఏజెంట్లకు ఐడెంటిటీ కార్డులు అందజేయాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియ, చెల్లని ఓట్ల గురించి రౌండ్ ముగిసిన తర్వాత ఏ జెంట్లకు తెలిపి మరుసటి రౌండ్ ప్రారంభించాలన్నారు. ఈ నెల 24, 25తేదీల్లో మిర్యాలగూడ డివిజన్ కు దేవరకొండ, నల్గొండ డివిజన్ నుండి మండల పర్య వేక్షక అధికారులు,అన్ని శాఖల ఇంజనీర్లు సంబంధిత మండలంలో కేటాయించిన గ్రామ పంచాయతీలలో సమస్యలు వుంటే పరిష్కరించాలని ఆదేశించారు. గొడవలు జరిగే ప్రాంతాలలో వీడియో గ్రఫీ నిర్వహించాలన్నారు. ఓటర్ల జాబితా మార్క్ డ్ కాపీతో చేరికలు, సవరణల జాబితా రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు, పోలింగ్ పార్టీలకు అందజేయాలన్నారు. స్టేజ్ 2 అధికారులు పోలింగ్,కౌంటింగ్ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తారని, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు సకాలంలో హజరు కావాలని అన్నారు.పోలింగ్ బ్యాలెట్ బాక్స్ లు,బ్యాలెట్ పేపర్లు సరి చూసుకొని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. పోలింగ్ స్టేషన్ లొకేషన్ మార్పులు వుంటే వెంటనే తెలిపి రాజకీయ పార్టీలకు కూడా తెలియజేయాలన్నారు.స్టేజ్ 2 అధికారులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. డిస్ట్రి బ్యూషన్ సెంటర్ వైద్య బందం ఏర్పాటు చేయాలని వైద్య ,ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి రవీంద్ర నాథ్, తదితరులు పాల్గొన్నారు.